యాప్నగరం

నట్టింట్లో నిండుగర్భిణి మృతదేహం.. ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి.! చంపేశారా..?

కొద్దిరోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన వివాహిత శవమై కనిపించింది. ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్న ఆ యువతిది హత్యా? ఆత్మహత్యా? అని తేల్చేపనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Samayam Telugu 30 Nov 2019, 5:08 pm
నిండుగర్భిణి నిర్జీవంగా పడి ఉన్న ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. నిన్నటి వరకు బాగానే ఉన్న ఆమె.. తెల్లారేసరికి మృతి చెందడం సందేహాలను రేకెత్తిస్తోంది. ఏడాది కిందటే పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి.. తొమ్మిది నెలల గర్భంతో చనిపోవడం మిస్టరీగా మారింది. తూర్పు గోదావరిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Samayam Telugu death.


వివాహిత మహిళ అనుమానాస్పద మృతి చెందిన ఘటన పాలకొల్లు పట్టణం మావుళ్లమ్మ పేటలో జరిగింది. పాలకొల్లుకు చెందిన ప్రియదర్శిని అనే వ్యక్తికి, మొగల్తూరు మండలం తూర్పుతాళ్లు గ్రామానికి చెందిన కోడి దుర్గ(19)కు ఏడాది క్రితం పేరుపాలెం బీచ్‌లో పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు.

Also Read: కర్నూలులో మానవ మృగం.. కన్నకూతురిపై అఘాయిత్యం..

గతేడాది ఫిబ్రవరిలో దుర్గను ఇంటి నుంచి తీసుకొచ్చేసిన ప్రియదర్శిని ఆమెతో రెండు నెలలపాటు సహజీవనం చేసినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఏప్రిల్‌లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం దుర్గ నిండు గర్భిణి. తొమ్మిది నెలల గర్భంతో ఉన్న దుర్గ అకస్మాత్తుగా శుక్రవారం రాత్రి మృతి చెందింది. అప్పటి వరకు బాగానే ఉన్న మహిళ హఠాత్తుగా చనిపోవడంపై దుగ్గ బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రియదర్శినే భార్యను దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని దుర్గ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ప్రియదర్శిని బంధువులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి విచ్చేసిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: సొంత చెల్లెలిపై అన్న అత్యాచారం.. విజయవాడలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.