యాప్నగరం

విజయసాయిరెడ్డికి ఎంపీ పదవి పోయే ముప్పు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి లాభదాయక పదవుల కేసులో పెద్ద ఊరట లభించింది.

Samayam Telugu 7 Sep 2020, 11:19 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి లాభదాయక పదవుల కేసులో పెద్ద ఊరట లభించింది. విజయసాయిరెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ వేసిన పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొట్టివేశారు. కేబినెట్ ర్యాంక్ స్థాయిలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డి లాభాదాయక పదవిలో ఉన్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత సీహెచ్ రామకోటయ్య ఫిర్యాదు చేశారు.
Samayam Telugu విజయసాయిరెడ్డి


రాజ్యసభ ఎంపీగా ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పదవి కలిగి ఉండడంపై రామకోటయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. లాభదాయక పదవులు కలిగి ఉన్నందున రాజ్యసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని రాష్ట్రపతి తీసుకున్నారు. అయితే ప్రత్యేక ప్రతినిధిగా ఎలాంటి జీతభత్యాలు తీసుకోనందున ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద పరిగణించలేమని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

ప్రిపెన్షన్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ యాక్ట్ దీనికి వర్తించదని ఎన్నికల సంఘం పేర్కొంది. దీంతో ఈసీ అభిప్రాయం మేరకు విజయసాయిరెడ్డి అనర్హత పిటిషన్‌ను కొట్టేస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.