యాప్నగరం

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

ఆలయం దగ్గరకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి, జెఈవో బ‌సంత్‌కుమార్‌‌, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, అర్చక బృందంతో కలిసి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.

Samayam Telugu 24 Nov 2020, 1:09 pm
తిరుచానూరు పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు. ఆలయం దగ్గరకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి, జెఈవో బ‌సంత్‌కుమార్‌‌, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, అర్చక బృందంతో కలిసి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను వారికి ఛైర్మ‌న్‌ అందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, ఇంటెలిజెన్స్ ఐజి శశిధర్ రెడ్డి, టిటిడి సివిఎస్‌వో గోపినాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ ర‌మేష్‌రెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, విజివో మనోహర్, డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి కొద్దిసేపట్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనానంతరం 4.50 గంటలకు రేణిగుంట చేరుకుని, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.