యాప్నగరం

ఆలయానికి వచ్చిన మహిళపై పూజారి అఘాయిత్యం.. విచారణ.!

భక్తురాలిని మాయమాటలతో నమ్మించి ఆలయంలోనే అత్యాచారానికి యత్నించినట్లు ఆరోపణలు రావడంపై దేవదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. భక్తురాలిని గర్భాలయంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడని అర్చకుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

Samayam Telugu 27 Nov 2019, 8:42 pm
భక్తురాలిపై కన్నేసిన ఓ పూజారి మాయమాటలతో నమ్మించి అఘాయిత్యానికి ఒడిగట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైకుంఠపురం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన మహిళపై అర్చకుడు అఘాయిత్యానికి యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.
Samayam Telugu rape


పిల్లలు కలిగేందుకు ప్రత్యేక పూజలు చేయాలని మాయమాటలు చెప్పి నమ్మించి గర్భాలయంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. మహిళ తీవ్రంగా ప్రతిఘటించి పెద్దగా కేకలు వేయడంతో పూజారి క్రోసూరి లక్ష్మీనరసింహచార్యులు మరోద్వారం గుండా పరారైనట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

Also Read: రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన మహిళా వీఆర్వో.. నెల్లూరు జిల్లాలో ఘటన

భక్తురాలిపై పూజారి అత్యాచార యత్నం చేశాడన్న ఆరోపణలపై దేవదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. అమరావతి మండలం వైకుంఠపురం విచ్చేసిన అధికారులు వివరాలు సేకరించారు. అత్యాచారానికి యత్నించిన అర్చకుడిపై చర్యలు తీసుకోవాలని, తక్షణం ఆ పూజారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆలయం వద్ద ఆందోళన చేపట్టినట్లు సమాచారం.

ఘటనను సీరియస్‌గా తీసుకున్న దేవదాయ శాఖ అధికారులు క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఇరవై నాలుగు గంటలలో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. అయితే పూజారి లక్ష్మీనరసింహచార్యులును ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.