యాప్నగరం

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కల నెరవేరింది.. మాట నిలబెట్టుకున్నా: రాం మాధవ్

ఆర్టికల్ 370 రద్దు పట్ల బీజేపీ నేత రాంమాధవ్ స్పందించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సహా వేలాది మంది అమరుల కల నెరవేరిందన్నారు.

Samayam Telugu 5 Aug 2019, 8:12 pm
ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం.. జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. కశ్మీర్ నుంచి లడక్‌ను విడదీసి ఆ ప్రాంతాన్ని కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. బీజేపీ 2014, 2019 ఎన్నికల మెనిఫెస్టోలో ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని ప్రకటించింది. కశ్మీర్‌కు కట్టబెట్టిన ప్రత్యేక హక్కులకు వ్యతిరేకంగా 1953లోనే భార‌తీయ జ‌న్ సంఘ్ వ్య‌వ‌స్థాప‌కుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోరాటం సాగించారు. క‌శ్మీర్ అధిక‌ర‌ణ‌ల‌కు వ్య‌తిరేకంగా ముఖర్జీ అప్ప‌ట్లో భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టగా ఆయన్ను జమ్మూలో అరెస్ట్ చేశారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద 40 రోజులు ఆయన్ను నిర్బంధంలో ఉంచారు.
Samayam Telugu ram madhav1


ఎన్నికల హామీని నెరవేర్చాం అన్నట్టుగా.. ప్రామిస్ ఫుల్‌ఫిల్డ్ అని ఆర్టికల్ 370ని రద్దు చేయాలని గతంలో మోదీ ధర్నా చేపట్టిన ఫొటోను బీజేపీ నేత రాం మాధవ్ ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీర్లో భారత్‌లో పూర్తిగా భాగం కావాలని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సహా వేలాది మంది అమరుల కల నెరవేరింది. ఏడు దశాబ్దాల భారత ప్రజల డిమాండ్ మన కళ్ల ముందు నిజమైంది. దీన్ని ఎప్పుడైనా ఊహించగలిగారా? అని రాం మాధవ్ ట్వీట్ చేశారు.
రాజ్యసభలో అమిత్ షా మాట్లాడిన తీరుపై రాం మాధవ్ ప్రశంసలు గుప్పించారు. ‘‘యునైటైడ్ ఇండియా ఆవిర్భావం సందర్భంగా దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. జమ్మూ, లడఖ్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. కశ్మీర్ లోయలోని ప్రజలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తార’’ని రాంమాధవ్ తెలిపారు.

Read Also: జమ్మూ కశ్మీర్ పునర్విభజన.. రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.