యాప్నగరం

NTR శత జయంతి ఉత్సవాల్లో ఇది ఒక మైలురాయి: పురంధేశ్వరి

NTR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గతేడాది మే 28 నుంచి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నందమూరి తారక రామారావు బొమ్మతో వెండి నాణెం ముద్రణ చేయనున్నట్టు ప్రకటించింది. దీనిపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. ఆయన కుమార్తె పురంధేశ్వరి కేంద్ర మంత్రిని కలిసి కృతజ్ఞతలు చెప్పారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 16 Feb 2023, 9:43 pm

ప్రధానాంశాలు:

  • ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల వేళ తీపి కబురు
  • ఎన్టీఆర్‌ బొమ్మతో వెండినాణెం ముద్రణకు నిర్ణయం
  • నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు చెప్పిన పురంధేశ్వరి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Purandeswari with Nirmala Sitharaman
నిర్మలా సీతారామన్‌తో పురంధేశ్వరి
NTR: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంత్యుత్సవాల వేళ.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌ బొమ్మతో రూ.100 వెండి నాణెం ముద్రించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ కుమార్తె, కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి నుంచి మింట్‌ అధికారులు సలహాలు, సూచనలను తీసుకున్నారు.
ఎన్టీఆర్‌ పేరిట నాణెం తీసుకురావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను తాను కోరానని.. పురందేశ్వరి చెప్పారు. నిర్మలా సీతారామన్‌ వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న నేపథ్యంలో మింట్‌ నుంచి ఆమోదం వచ్చిందని వివరించారు. సంబంధిత అధికారులు 3 ఫొటోలను పరిశీలించారని చెప్పారు. నాణెం రూపకల్పన ప్రొసీజర్‌కు నెలరోజుల సమయం పడుతుందని.. ఆ తర్వాతే విడుదల చేస్తారని వివరించారు.

'నందమూరి తారక రామారావు బొమ్మ 100 రూపాయల నాణెం మీద ముద్రించబడుతుంది. శత జయంత్యుత్సవాల్లో ఇది ఒక మైలురాయి. నన్ను అనుగ్రహించిన భగవంతుడుకి, నన్ను ఆశీర్వదించిన నా తండ్రికి, అన్నివిధాల తన సహకారం అందించిన నిర్మలా సీతారామన్‌కు నా ధన్యవాదాలు' అని ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి వ్యాఖ్యానించారు.
Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.