యాప్నగరం

వ్యవసాయం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే

తమ సొంత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు.. వ్యవసాయ పనుల్లో బిజీగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే.. వరి పొలానికి పురుగుల మందు కొట్టిన ఎమ్మెల్యే.

Samayam Telugu 21 Oct 2020, 10:26 am
కరోనా దెబ్బకు భయంతో జనాలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఎవరి ఇళ్లకు వాళ్లే పరిమితం అవుతున్నారు. ఇక నగరాలు, పట్టణాల్లో పరిస్థితి బాగా లేకపోవడంతో అందరూ ఊళ్లకు వెళ్లిపోయారు. ఇక ప్రజా ప్రతినిధులు కూడా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అలాగే సరదాగా పొలం వైపు వెళుతున్నారు.. తమ పనుల్ని చక్కబెట్టుకుంటున్నారు.
Samayam Telugu ఎమ్మెల్యే వ్యవసాయం


చిత్తూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ఎప్పుడూ ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా కనిపించే పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబు పొలం బాట పట్టారు. చిత్తూరు మండలం వెంకటాపురం (పిళ్లారిమిట్ట)లో తన పొలంలో వరి వేశారు. తాను సాగు చేస్తున్న వరి పంటను మంగళవారం ఆయన పరిశీలించారు. పంటకు తెల్ల చీడలు సోకినట్లు గుర్తించిన ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. వారి సూచనల మేరకు ఆయన స్వయంగా గంటపాటు పురుగుల మందు స్ప్రే చేశారు. మరికొంతమంది ప్రజా ప్రతినిధులు కూడా ఇలా రోజులో కొద్ది సమయాన్ని పొలం పనులకు కేటాయిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.