యాప్నగరం

కర్నూలు: గుర్రంపై లాక్‌డౌన్ విధులకు ఎస్సై.. దీనికి ఓ ప్రత్యేకత ఉంది

గుర్రంపై విధులకు హాజరైన కర్నూలు జిల్లా ప్యాపిలి ఎస్సై.. తెల్ల గుర్రంపై కరోనా వైరస్ ఆకారంలో పెయింటింగ్ చేసి వినూత్నంగా ప్రజల్లో అవగాహన కల్పించిన ఎస్సై.

Samayam Telugu 31 Mar 2020, 11:03 am
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తోంది. పోలీసులు 24 గంటలు రోడ్లపైనే గడిపేస్తున్నారు.. జనాల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. జనాలెవరూ రోడ్లపైకి రావొద్దు అంటూ జాగ్రత్తలు సూచిస్తున్నారు. కానీ ఆ నిబంధనల్ని పట్టించుకోకుండా రోడ్ల మీదకు వస్తున్నారు కొంతమంది ఆకతాయిలు. దీంతో అక్కడక్కడా పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పడం లేదు. తర్వాత అకారణంగా పోలీసులు అమాయకుల్ని కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ఒకటి రెండు ఘటనల్లో అలా జరిగి ఉండొ చ్చు.. కానీ పోలీసుల కష్టాలను కూడా అర్ధం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది.
Samayam Telugu knl.


కర్నూలు జిల్లా ప్యాపిలి ఎస్సై మాత్రం విధులకు కాస్త భిన్నంగా వస్తున్నారు. గుర్రంపై వచ్చి రోడ్లపైకి ఎవరూ రావొద్దని హెచ్చరిస్తున్నారు. తెల్లని గుర్రంపై ఎరుపు రంగులో కరోనా వైరస్‌ గుర్తులు వేయించి దానిపై కూర్చొని తిరుగుతూ ప్రజలకు కరోనా గురించి ప్రచారం చేశారు. ఇలా వినూత్న ప్రచారం చేస్తూ.. ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా రోడ్లపైకి వచ్చినా.. రేషన్‌ దుకాణాల దగ్గరసామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్రజలంతా సహకరించాలని కోరుతున్నారు.

ఈ తెల్ల గుర్రంపై కరోనా వైరస్ ఆకారంలో ఎర్ర రంగుతో పెయింటింగ్ వేశారు. కరోనా వైరస్ ప్రమాదంపై ఇలా ప్రజల్లో వైరస్‌పై అవగాహన పెంచేందుకు గుర్రంపై వచ్చి అవగాహన కల్పిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. మొత్తాన్ని ప్యాపిలి ఎస్సై గుర్రంపై వచ్చి కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేయడంతో పాటూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.