యాప్నగరం

గుంటూరు: పొలంలో కొండ చిలువ.. భయంతో రైతుల పరుగులు

వరద నీటిలో కొండ చిలువ కూడా కొట్టకుని వచ్చింది. పొలాల పక్కన తిరుగుతూ ఉండడంతో అది చూసిన రైతులు, స్థానికులు భయభ్రాంతులకు గురై అక్కడి నుండి పరుగులు తీశారు.

Samayam Telugu 23 Oct 2020, 11:04 am
గుంటూరు జిల్లాలో కొండచిలువ కలకలం రేపింది. కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాములు, చేపలు వరద నీటిలో పొలాల వైపు కొట్టుకొని వస్తున్నాయి. అలాగే తాడేపల్లి మండలం ఉండవల్లిలో వరద నీటిలో కొండ చిలువ కూడా కొట్టకుని వచ్చింది. పొలాల పక్కన తిరుగుతూ ఉండడంతో అది చూసిన రైతులు, స్థానికులు భయభ్రాంతులకు గురై అక్కడి నుండి పరుగులు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేశారు. అటవీశాక అధికారులు ఆ కొండ చిలువను పట్టుకున్నారు.
Samayam Telugu గుంటూరు జిల్లా


గుంటూరు జిల్లా మాత్రమే కాదు.. ఇటీవల హైదరాబాద్‌లో కూడా వరద నీటిలో కొండ చిలువ కొట్టుకుని వచ్చింది. భారీ వరద నీరు చేరుకోవడంతో బస్తీల్లోకి పాములు, తేళ్లు వస్తున్నాయి. పురానాపూల్ ప్రాంతంలోకి ఓ పెద్ద కొండచిలువ వచ్చింది. కొందరు యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దానిని పట్టుకొని సంచిలో వేసి బంధించారు. ఇక పొలాల్లో పాముల బెడద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.