యాప్నగరం

విశాఖ ప్రైవేట్ కంపెనీలో కొండ చిలువ కలకలం

కొండ చిలువను చూసిన ఆ కంపెనీ భద్రతా సిబ్బంది వెంటనే స్నేక్‌ సేవా సొసైటీ ప్రతినిధులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకుని చాకచక్యంగా కొండ చిలువను పట్టుకున్నారు.

Samayam Telugu 27 Oct 2020, 9:30 am
Samayam Telugu విశాకలో కొండ చిలువ కలకలం
విశాఖలో కొండ చిలువ కలకలంరేపింది. గాజువాక ఆటోనగర్‌ డి-బ్లాకులోని ఓ సంస్థ కార్యాలయంలో ఆదివారం రాత్రి 10 అడుగుల కొండ చిలువ ప్రత్యక్షమైంది. కొండ చిలువను చూసిన ఆ కంపెనీ భద్రతా సిబ్బంది వెంటనే స్నేక్‌ సేవా సొసైటీ ప్రతినిధులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకుని చాకచక్యంగా కొండ చిలువను పట్టుకున్నారు. ఆ కొండ చిలువను తిరిగి అటవీ ప్రాంతంలో వదిలివేయనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పాములు ఇలా జనావాసాలు, పొలాల్లోకి వస్తున్నాయి.

మూడు రోజుల క్రితం గుంటూరు జిల్లాలో కూడా కొండచిలువ కలకలం రేపింది. కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాములు, చేపలు వరద నీటిలో పొలాల వైపు కొట్టుకొని వస్తున్నాయి. అలాగే తాడేపల్లి మండలం ఉండవల్లిలో వరద నీటిలో కొండ చిలువ కూడా కొట్టకుని వచ్చింది. పొలాల పక్కన తిరుగుతూ ఉండడంతో అది చూసిన రైతులు, స్థానికులు భయభ్రాంతులకు గురై అక్కడి నుండి పరుగులు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేశారు. అటవీశాక అధికారులు ఆ కొండ చిలువను పట్టుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.