యాప్నగరం

మూడు రాజధానుల కాన్సెప్ట్ అద్భుతం.. అదే జరిగితే ఏపీలో రాష్ట్రపతి పాలన ఖాయం: రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు

Raghu Rama Krishnam Raju ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోర్టు అనుమతితో చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవాలని చూడటం దారుణమన్నారు. పాదయాత్రను కేంద్రం, కోర్టులు గమనిస్తూనే ఉన్నారన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 4 Oct 2022, 7:10 am

ప్రధానాంశాలు:

  • ఎంపీ రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు
  • మూడు రాజధానులు అధ్భుతమని
  • రాష్ట్రపతి పాలన ఖాయమంటూ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Raghu Rama Krishna Raju
పాదయాత్ర మీద దాడులకు దిగితే పోలీసు వ్యవస్థపై, ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుంది అన్నారు ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghu Rama Krishna Raju). రైతుల పాదయాత్రను కోర్టులు, కేంద్రం, రాష్ట్రపతి భవన్‌ ఎప్పటికప్పుడూ గమనిస్తూనే ఉన్నాయని.. మంత్రివర్గం ఆమోదించిన రాజధానిని హైకోర్టు తిరస్కరించిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే రాలేదు అన్నారు. సుప్రీంకోర్టులో కేసు అసలు లిస్టే కానప్పుడు మంత్రులు మాట్లాడకూడదు అన్నారు. కోర్టు అనుమతితో శాంతియుతంగా సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రను అల్లర్ల ద్వారా అడ్డుకోవాలని చూస్తే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమన్నారు.

కోర్టు అనుమతితో అమరావతి రైతులు శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అల్లర్లు సృష్టించి అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. కనుక అలాంటి పిచ్చి పనులు మానుకోవాలని హెచ్చరించారు. పాదయాత్రను న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి భవన్‌ ఎప్పటికప్పుడూ గమనిస్తూనే ఉన్నాయన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ, పశ్చిమగోదావరి జిల్లాలో రైతుల పాదయాత్రకు ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నించారని, అయినా విజయంవతమైందని గుర్తు చేశారు. వికేంద్రీకరణ గురించి కొన్ని పత్రికల్లో ఎన్ని వార్తలు రాసుకున్నా.. ఎంపీలతో మాట్లాడించినా.. అవి ఎవరు మాట్లాడించారో అని ప్రజలందరికీ తెలుసున్నారు.
మూడు రాజధానుల కాన్సెప్ట్ అద్భుతమని.. కానీ దేశంలోని ఏ రాష్ట్రంలో ఈ విధానం అమలులో లేదని రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఒక్క దక్షిణాఫ్రికాలో మాత్రమే మూడు రాజధానుల విధానం అమల్లో ఉందని.. ఆ దేశంలోనూ ఇప్పుడు ఒకే రాజధానిని కోరుకుంటున్నారని చెప్పారు. పౌరసరఫరాల శాఖలో జరుగుతున్న అక్రమాలపై తాను రాసిన లేఖపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలను పేర్కొంటూ సమాధానం అందిందన్నారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం అవాస్తవాలను చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిందన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.