యాప్నగరం

విజయవాడ: రైల్వే ఉద్యోగి ఆత్మహత్య.. సెల్పీ వీడియోలో పురుగుల మందు తాగేశాడు

ఆత్మహత్యకు ముందు ఆ ఉద్యోగి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. సెల్ఫీ వీడియోలోనే పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి రైల్వే ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.

Samayam Telugu 4 Jun 2020, 9:57 am
కృష్ణా జిల్లాలో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య కలకలంరేపింది. అతడు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. స్థానికులు గమనించి రైల్వే ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడు రాయనపాడుకు చెందిన రైల్వే కీమేన్‌ రాజుగా పోలీసులు గుర్తించారు. అధికారుల వేధింపుల భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నట్లు ఆత్మహత్యకు ముందు ఆ ఉద్యోగి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. సెల్ఫీ వీడియోలోనే పురుగుల మందు తాగాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు.
Samayam Telugu సెల్ఫీ వీడియో


మరోవైపు విజయవాడలో మరో విషాద ఘటన జరిగింది. ఇద్దరు బిడ్డలతో కలిసి మహిళ కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి చనిపోగా.. ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు పిల్లలకు ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. వీరిని పశ్చిమగోదావరి జిల్లా మార్తాండ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.