యాప్నగరం

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉన్నట్లు వెల్లడించింది. మే 15 నాటికి అది వాయుగుండంగా మారి బలపడే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఇది మరింత బలపడి 16 సాయంత్రానికి తుఫాన్‌గా మారి క్రమంగా వాయువ్య బంగాళాఖాతం వైపు పయనిస్తుందంటోంది.

Samayam Telugu 14 May 2020, 8:03 am
ఏపీకి వాతావరణశాఖ వర్ష సూచన చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉన్నట్లు వెల్లడించింది. మే 15 నాటికి అది వాయుగుండంగా మారి బలపడే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఇది మరింత బలపడి 16 సాయంత్రానికి తుఫాన్‌గా మారి క్రమంగా వాయువ్య బంగాళాఖాతం వైపు పయనిస్తుందంటోంది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలు, తమిళనాడు తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
Samayam Telugu ఏపీకి వర్ష సూచన


ఈ అల్ప పీడన ప్రభావంతో నేడు, రేపు ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు పడాతయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 15 తర్వాత మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. ఇటు రాగల 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం లో అండమాన్‌ వద్ద అల్పపీడనం ఏర్పడే అవకా శం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో తెలంగాణలో పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడే అవకా శం ఉందంటున్నారు అధికారులు. రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న సమయంలో వర్షాలు పడితే ఉపశమనమనే చెప్పాలి. గతవారం కూడా హైదరాబాద్‌లో అక్కడక్కడా చిరు జల్లులు పలకరించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.