ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం ఉదయం ఒడిశాలోని చాంద్బలి సమీపంలో తీరం దాటి పశ్చిమ వాయువ్యంగా పయనించి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్ దిశగా పయనించి క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావం ఉత్తరకోస్తాలో కొన్ని ప్రాంతాలకు ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. సోమవారం కోస్తాలో అనేకచోట్ల మేఘాలు ఆవరించి తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది.
ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాలకు అధికారుల అలర్ట్
ఒడిశాలోని చాంద్బలి సమీపంలో తీరం దాటి పశ్చిమ వాయువ్యంగా పయనించి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. సోమవారం కోస్తాలో అనేకచోట్ల మేఘాలు ఆవరించి తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది.
Samayam Telugu 14 Sep 2021, 8:34 am
ప్రధానాంశాలు:
- ఏపీకి వాతావరణశాఖ వర్ష సూచన
- బంగాళాఖాతంలో వాయుగుండం
- వచ్చే 24 గంటలూ వానలకు ఛాన్స్