ఏపీకి రెయిన్ అలర్ట్.. దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం.. దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు అల్పపీడనం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో రుతుపవన ద్రోణి ఏపీ వైపు విస్తరించింది. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కి.మీ, గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. తీరం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని.. మత్స్యకారులెవరూ 24 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఈ ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ చెబుతోంది. సోమవారం విశాఖ నుంచి గుంటూరు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. సోమవారం ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నాయి.
ఆదివారం మధ్యాహ్నం నుంచి కోస్తాంధ్ర అంతటా వాన ముసురు పట్టేసింది. రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు అనేక ప్రాంతాలు, కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి.
ఆదివారం మధ్యాహ్నం నుంచి కోస్తాంధ్ర అంతటా వాన ముసురు పట్టేసింది. రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు అనేక ప్రాంతాలు, కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి.