యాప్నగరం

ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఆ నాలుగైదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. శుక్రవారం విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

Samayam Telugu 4 Jul 2020, 7:07 am
ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది దక్షిణ దిశగా ఒంపు తిరిగడంతో.. ఈ ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. ఇక కొన్నిజిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Samayam Telugu ఏపీ వర్ష సూచన


ఇదిలా ఉంటే శుక్రవారం విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నర్సీపట్నం,హిరమండలం, కూనవరంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలో వర్షానికి ఈదురుగాలులు తోడయ్యాయి. కాలువలు, కొండగెడ్డలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. మాకవరపాలెంలో యాతపేట, కొత్తవీధి ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతాల్లో మురుగు కాలువలు, రోడ్లు ఏకమయ్యాయి. మన్యంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.