యాప్నగరం

AP Rains: వీడని వాన ముప్పు.. మరో నాలుగు రోజులపాటు వర్షాలు

Andhra Pradesh Rains: ఏపీలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 7 May 2023, 8:41 am

ప్రధానాంశాలు:

  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • మరో నాలుగు రోజులపాటు వర్షాలు
  • వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Andhra Pradesh Rains
ఏపీలో వర్షాలు
AP Weather Today: రానున్న నాలుగు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్‌డీఎంఏ) జిల్లాలను అప్రమత్తం చేసింది. వాయుగుండం మే 8 ఉదయం నాటికి అల్పపీడన జోన్‌గా మారే అవకాశం ఉందని తెలిపింది.
ఇది మరుసటి రోజు అల్పపీడనంగా కేంద్రీకృతమై తుఫానుగా మారే అవకాశం ఉందని.. అదే సమయంలో దాదాపు ఉత్తర దిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతుందని అధికారులు వెల్లడించారు. తుపాను మయన్మార్ వైపు వెళ్లే అవకాశం ఉందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ స్పష్టం చేశారు. రానున్న 24 గంటల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతంలోనూ ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక ఏపీలో శనివారం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, ఏలూరు, బాపట్ల, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం మన్యం, తిరుపతి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో భారీ వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో ఉదయం 8.30 నుంచి రాత్రి 8 గంటల మధ్య 78.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు 30 మండలాల్లో 30 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందనట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో శనివారం నంద్యాలలో అత్యధికంగా 38.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఒంగోలులో అత్యల్పంగా 32.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావారణశాఖ అధికారులు తెలిపారు.

రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.