యాప్నగరం

మాజీ ఎంపీ హర్ష కుమార్‌ అరెస్ట్.. నో బెయిల్.. జైలుకు తరలింపు

అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్‌ను రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశారు. 75 రోజులపాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన శుక్రవారమే రాజమండ్రి వెళ్లారు.

Samayam Telugu 13 Dec 2019, 10:54 pm
అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 75 రోజులపాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన.. శుక్రవారం రాజమండ్రి వెళ్లారు. కాసేపటికే ఆయన్ను త్రిటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జ్యుడిషియల్ సిబ్బందిని దూషించిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. హర్ష కుమార్‌పై 353, 323, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్యపరీక్షల అనంతరం పోలీసులు మాజీ ఎంపీని రాజమండ్రి 7వ అదనపు కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు.
Samayam Telugu harsha kumar


హర్ష కుమార్‌కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన మెజిస్ట్రేట్.. ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో మాజీ ఎంపీని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

పోలీసుల తీరుపై హర్ష కుమార్, ఆయన అనుచరులు మండిపడుతున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా.. తనపై ఎందుకింత కసి అని గతంలో ప్రశ్నించిన హర్ష కుమార్.. చివరకు ఎయిర్‌పోర్టులను కూడా వదలడం లేదని మండిపడ్డారు. 353, 354 సెక్షన్ల కింద కేసు పెట్టిన ఎంత మంది గురించి విమానాశ్రయాలకు సమాచారం ఇచ్చారో చెప్పగలరా? అని ఆయన ఏపీ డీజీపీని ప్రశ్నించారు. కనీసీ ఇలాంటి కేసు ఒక్కటైనా ఉందేమో చెప్పగలరా అని నిలదీశారు.

హర్ష కుమార్ గత కొద్ది రోజులపాటు తెలంగాణలో ఉన్నారని తెలుస్తోంది. హత్యాచారానికి గురైన సమత కుటుంబీకులను ఆయన పరామర్శించారు. గురువారమే ఓ ఫంక్షన్‌కు హాజరైన ఫొటోలను సైతం సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.