యాప్నగరం

Pawan Kalyanపై రాజు రవితేజ్ సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్‌లో ఎన్నికల తర్వాత మార్పు వచ్చింది. ఆయన ఎవరి సలహాలు తీసుకొరు.. ఒకవేళ ఇస్తే అలాంటి వాళ్లను పక్కన పెట్టేస్తారు. బీజేపీకి అనుకూలంగా ఉండాలనే సూచనలు వస్తున్నాయి.

Samayam Telugu 14 Dec 2019, 6:57 pm
జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేత రాజు రవితేజ్ అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని పవన్ ప్రయత్నిస్తున్నారని.. పార్టీ కోసం చాలా చేద్దామనుకున్నానని.. కానీ స్వేచ్ఛ లేదన్నారు. పార్టీలో అంతర్గతంగా పారదర్శకత లేదని.. మతాల ప్రస్తావన లేని రాజకీయాలు జనసేన సిద్ధాంతమని.. కానీ ప్రస్తుత పార్టీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. శనివారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన రవితేజ.. తన రాజీనామాకు కారణాలు వివరించారు.
Samayam Telugu ravi


Read Also: Janasena Party ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు

సొంత పార్టీ వాళ్లపై స్కెచ్‌లు వేయడం, వ్యక్తిగత విషయాలు మాట్లాడటం నచ్చలేదన్నారు రవితేజ్. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్‌లో మార్పు వచ్చిందని.. ప్రతిపక్షాల కంటే ఎక్కువగా సొంత పార్టీ వాళ్లనే వ్యతిరేకిస్తున్నారన్నారు. పవన్ ఎవరి సలహాలు తీసుకోరని.. ఒకవేళ ఎవరైనా సలహాలు ఇస్తే.. అలాంటి నేతల్ని పక్కనపెడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అనుకూలంగా ఉండాలనే సూచనలు వస్తున్నాయని.. ఈ నిర్ణయాన్ని తాను సమర్థించలేనన్నారు.

పవన్ కళ్యాణ్ కులమతాలకు అతీతంగానే ఉంటారని.. కానీ రాజకీయ లబ్ది కోసం ఇప్పుడు కులమతాల ప్రస్తావన తెస్తున్నారని పరోక్షంగా ఆరోపించారు. ఆయన సమాజాన్ని విభజించే శక్తులతో కలిసి పనిచేస్తున్నారని.. రాజకీయం కోసం ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఏ సిద్ధాంతాలతో పార్టీని పెట్టారో.. ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం పవన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. జనసేనకు రాజీనామా చేశానని.. తాను భవిష్యత్‌లో ఏ పార్టీలో చేరనని క్లారిటీ ఇచ్చారు.

రాజు రవితేజ్ జనసేన పార్టీకి రాజీనామా చేశారు.. ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. తర్వాత రవితేజ రాజీనామాను అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆమోదించారు. పార్టీ పట్ల ఆయన అభిప్రాయాలను, ఆవేదనను గౌరవిస్తున్నానని.. గతంలోనూ ఆయన ఇలాంటి ఆవేదనతోనే పార్టీనీ వీడి.. మళ్లీ వచ్చారని గుర్తు చేశారు. శనివారం ప్రెస్‌మీట్ పెట్టి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు. రాజు రవితేజ్ జనసేన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి ఇజం అనే పుస్తకాన్ని కూడా రచించారు.

పవన్ కళ్యాణ్ గతంలో ఇజం పేరిట పుస్తకాన్ని వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ పుసక్తాన్ని పవన్, రాజు రవితేజ్ కలిసి రాశారు. తెలంగాణలో వరంగల్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఆయన పవన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. జనసేన పార్టీ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా వ్యవహరించగా.. రాజు రవితేజ్ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 16 ఏళ్ల వయసులో ఆయన వెయిటర్‌గా జీవితాన్ని ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.