యాప్నగరం

రూటు మార్చిన రమణ దీక్షితులు.. తిరుమలపై మరోసారి ఆసక్తికర ట్వీట్

శ్రీవారి ఆలయంలో పనిచేసే అర్చకుల స్థానంలో వేరొకరికి తీసుకు రాలేమని.. వెంకటేశ్వర స్వామి నిత్య ఆరాధనలు ఆపితే మానవ జాతికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. కొన్ని వారాలపాటు స్వామి వారి దర్శనం ఆపాలని కోరారు.

Samayam Telugu 18 Jul 2020, 7:32 am
టీటీడీ ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ట్వీట్ వార్ కొనసాగిస్తున్నారు. మరోసారి కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. శ్రీవారి ఆలయంలో పనిచేసే అర్చకుల స్థానంలో వేరొకరికి తీసుకు రాలేమని.. వెంకటేశ్వర స్వామి నిత్య ఆరాధనలు ఆపితే మానవ జాతికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. కొన్ని వారాలపాటు స్వామి వారి దర్శనం ఆపాలని కోరారు. దర్శనాలు నిలిపి పూజలు ఏకాంతంగా నిర్వహించాలని.. అలా చేస్తే అర్చకులకు రక్షించిన వారవుతామన్నారు. తన ట్వీట్‌ను సీఎం జగన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ట్యాగ్ చేశారు.
Samayam Telugu రమణ దీక్షితులు

అంతకముందు టీటీడీలో కరోనా కేసుల వ్యవహారం దుమారం రేపింది. టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులు చేసిన ట్వీట్‌పై వివాదంగా మారింది. దీక్షితులు చేసిన ట్వీట్‌పై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. రమణదీక్షితులు టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులుగా ఉంటూ టీటీడీపై వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. ఆయన టీటీడీ ఆగమ సలహాదారుగా ఉన్నారని.. టీటీడీకి మంచి సలహాలు ఇవ్వాలి కానీ వివాదాలు చేయకూడదన్నారు.రమణ దీక్షితుల్ని పిలిచి మాట్లాడమని అధికారుల్ని ఆదేశించాను అన్నారు సుబ్బారెడ్డి. తిరుమలపై రాజకీయాలొద్దని రమణ దీక్షితుల్ని కోరుతున్నానని.. అర్చకుల విషయంలో టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. అర్చకులకు ఇబ్బంది కలిగితే దర్శనాలు నిలిపివేసేందుకు సిద్ధమన్నారు.

అంకతముందు టీటీడీలో కరోనా కేసులపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్ చేశారు. వంశపర్యంపర్య అర్చకులకు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో చంద్రబాబు నాయుడు పాలసీని అమలు చేస్తున్నారన్నారు. స్వామి వారి కైంకర్యాలు నిర్వహించే 50 మంది అర్చకులలో 15 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ తేలిందని.. మరో 25 మంది అర్చకులకు కరోనా పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందన్నారు. కేసులు పెరుగుతున్నా ఈవో, అదనపు ఈవో దర్శనాలు అపకపోవడం అర్చకులపై వారికి ఉన్న వ్యతిరేకత గుర్తు చెస్తోందని.. తన ట్వీట్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ట్యాగ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.