యాప్నగరం

పవన్ పార్టీ లక్ష్యంగా దుష్ప్రచారం.. సైబర్ క్రైం పోలీసుల చెంతకు..

జనసేన పార్టీ లక్ష్యంగా గత కొంత కాలంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. ఇది తారా స్థాయికి చేరడంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని జనసేన నిర్ణయించింది.

Samayam Telugu 19 Dec 2019, 7:22 pm
గత కొంత కాలంగా తమపై దుష్పచారం జరుగుతోందని జనసేన ఆరోపిస్తోంది. పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనసేన షోకాజ్ నోటీసులు ఇచ్చిందని.. దానికి ఆయన ఘాటుగా బదులిచ్చారని గతంలో ప్రచారం జరిగింది. తాజాగా ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని జనసేన పేరిట ఓ ఫేక్ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జనసేన సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.
Samayam Telugu Pawan_kalyan


పార్టీ లెటర్ హెడ్‌పై అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరిట ఫేక్ నోట్స్ సర్క్యులేట్ చేస్తున్నారని.. పార్టీకి సంబంధించిన ప్రకటనలను అధికారిక గ్రూపుల ద్వారానే మీడియాకు పంపిస్తామని జనసేన స్పష్టం చేసింది.


అసెంబ్లీలో రాపాక వరప్రసాద్ జగన్ సర్కారు పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారు. దీంతో ఆయన వైయస్సార్సీపీలో చేరతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ కాకినాడలో చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షకు రాపాక హాజరు కాలేదు. అసెంబ్లీ సమావేశాల కారణంగా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నానని చెప్పారు. దీంతో పవన్ ఆయనకు షోకాజ్ నోటీసులు పంపారని ప్రచారం జరిగింది. దీనికి రాపాక ఘాటైన సమాధానం ఇచ్చారని.. వాట్సాప్‌లో ఫేక్ పోస్టు వైరల్ అయ్యింది. తాజాగా రాపాకను పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఏకంగా జనసేన పేరిట ఫేక్ ప్రెస్ నోటు క్రియేట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.