యాప్నగరం

Pawan Kalyan సై అంటే వైసీపీ వాళ్ల తలలు నరుకుతా.. జనసేన నేత వివాదాస్పద వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ నీతిగా ఉందాం.. అందరికీ మర్యాద ఇద్దామనడంతో వెనక్కు తగ్గాం.. ఆయన సై అంటే వైసీపీ వాళ్ల తలలు నరకడానికి సిద్ధం అంటూ జనసేన పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు.

Samayam Telugu 5 Dec 2019, 4:36 pm
అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన జనసేన పార్టీ నేత పవన్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే వైఎస్సార్‌సీపీ నేతల తలలు నరుకుతామంటూ రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి సహా ఎవరైనా సరే తలలు నరుకుతామని.. కేసులకు జనసేన భయపడదు అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతల రెడీ అంటే తాము రెడీనే అంటూ సవాల్ విసిరారు.
Samayam Telugu pawan kumar


చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో పవన్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నీతిగా ఉందాం.. మర్యాద ఇద్దామనడంతో వెనక్కు తగ్గి ఉన్నామన్నారు. వైఎస్సార్‌సీపీ నేతల మీద భయంతో కాదు.. తమ పార్టీ అధినేతపై ఉన్న మర్యాద కారణం అన్నారు. సభా వేదికపై పవన్ కళ్యాణ్.. పార్టీ సీనియర్ నేతలు నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్ సహా అందరూ వేదికమీదే ఉన్నారు.

ఇదిలా ఉంటే జనసేన పార్టీ నేత వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ కూడా స్పందించారు. తలలు నరికేవాళ్లు రావొచ్చు.. పోలీసులు, చట్టాలు ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. అనంతపురం రండి.. ఎంతమంది తలలు నరుకుతారో చూద్దాం అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలపై స్పందించాలని.. ఒకవేళ స్పందించకపోతే.. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయించారని భావిస్తాం అన్నారు. పిచ్చి ప్రేలాపనలు చేస్తే ప్రజలు బుద్ది చెబుతారని.. జనసేన నేత క్రేజ్ కోసం నా పేరు వాడుతున్నారన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.