యాప్నగరం

‘సీఎం జగన్ను అప్పగించాలని కేంద్రానికి ఓ దేశం లేఖ’

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తమకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వానికి రస్‌ అల్‌ ఖైమా లేఖ రాసిందని టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ఆరోపించారు.

Samayam Telugu 19 Feb 2020, 4:08 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డిని తమకు అప్పగించాలంటూ రస్‌ అల్‌ ఖైమా కేంద్రానికి లేఖ రాసినట్లు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. తమ డబ్బును వైఎస్ జగన్‌ నుంచి తిరిగి వసూలు చేయటంతో పాటు ఆయన్ను కూడా అప్పగించాలన్నది ఆ లేఖ సారాంశమని వర్ల తెలిపారు. అప్పటి నుంచే వైసీపీ శిబిరంలో గందరగోళం నెలకొందని, హడావుడి ఢిల్లీ పర్యటనలు మొదలయ్యాయని దుయ్యబట్టారు.
Samayam Telugu jagan 8


Also Read: ‘జుట్టు పెంచినా, చొక్కా వేసుకున్నా జగన్ పన్ను’

అసలు రస్‌అల్‌ ఖైమా లేఖ రాసిందో లేదో సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. రస్‌అల్‌ ఖైమా ఇచ్చిన రూ. వేల కోట్ల దుర్వినియోగం చేశారనే ఆరోపణలపైనే సెర్బియా పోలీసులు 7 నెలల క్రితం నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేశారని గుర్తు చేశారు. ఆ డబ్బును ముఖ్యమంత్రి జగన్‌కు చెందిన వివిధ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లు నిమ్మగడ్డ ప్రసాద్‌ అక్కడి పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చారని ఆరోపించారు.

Also Read: బీజేపీతో జగన్, టీడీపీతో ఒవైసీ.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు

రస్‌ అల్‌ఖైమా నిధులను దుర్వినియోగం చేసినందుకే వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు అరెస్ట్‌ చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. కేసు తేలేవరకు సెర్బియా వదిలి వెళ్లిపోవద్దని నిమ్మగడ్డకు ఆంక్షలు జారీ చేశారన్నారు. ఏడు నెలల నుంచి నిమ్మగడ్డ సెర్బియాలోనే ఉండిపోయారని వెల్లడించారు. ఈ కేసులో ఎక్కడ ఇరుక్కుంటానోనని సీఎం జగన్‌ భయపడుతున్నారని తెలిపారు. ఏపీ పరువు అవినీతిలో ఖండాలు దాటి వెళ్లిపోయిందని వర్ల రామయ్య పేర్కొన్నారు.

Also Read: రాజధాని తరలింపు: హైకోర్టుకు కీలక విషయం చెప్పిన వైసీపీ సర్కార్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.