యాప్నగరం

Chandrababu Naiduకు నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ నినాదాలు, ఉద్రిక్తత

కర్నూలు పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకున్న రాయలసీమ స్టూడెంట్స్ జేఏసీ. గో బ్యాక్ అంటూ నినాదాలు.. అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం.

Samayam Telugu 2 Dec 2019, 3:51 pm
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాయలసీమలో నిరసన సెగ తగిలింది. కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన్ను విద్యార్థి, ప్రజా సంఘాలు అడ్డుకున్నాయి. ప్రభుత్వం హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడంతో పాటూ ప్రత్యేకంగా నిధులు కేటాయించాలనే డిమాండ్‌తో బాబును అడ్డుకున్నారు. ఆందోళనకారులు కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లడంతో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Samayam Telugu babu


ఏపీ ప్రభుత్వం హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడంతో పాటూ ప్రత్యేకంగా నిధులు కేటాయించాలనే డిమాండ్‌తో.. కొద్దిరోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లను ముట్టడించారు. దాదాపు రెండు నెలలుగా ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా ఈ నిరసన సెగ చంద్రబాబుకు తగిలింది.

మరోవైపు చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చారు. మూడు రోజుల పాటూ పార్టీ నేతలు, కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు పార్టీ బలోపేతంతో పాటూ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. వైఎస్సార్‌సీపీ బాధితుల పేరుతో.. టీడీపీ కార్యకర్తలు, నేతల్ని పరామర్శించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.