యాప్నగరం

విజయనగరం: పెళ్లైన తొమ్మిది నెలలకే వెంటాడిన విషాదం

తొమ్మిది నెలల క్రితమే వివాహం.. భార్య ఆరు నెలల గర్భిణీ.. ఇంతలోనే వెంటాడిని మృత్యువు .. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు. విజయనగరం జిల్లాలో విషాదం.

Samayam Telugu 2 Dec 2020, 9:57 am
కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభించిన ఆ జంటను విషాదం వెంటాడింది. రోడ్డు ప్రమాద రూపంలో యువకుడ్ని మృత్యువు మింగేసింది. కొమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన వెంకటరమణ, జయలక్ష్మిలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రవీణ్‌, రెండో కుమారుడు ప్రదీప్.. వీరంతా కూరగాయల సాగు చేస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. ప్రవీణ్‌కు కమ్మరిగుంటకు చెందిన రోజాతో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. ప్రవీణ్‌ కూరగాయాలను బొబ్బిలి మార్కెట్‌కు బొలేరో వాహనంలో తీసుకెళుతుంటారు. మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో డ్రైవర్‌తో కలిసి వెళ్లాడు.
Samayam Telugu విజయనగరం జిల్లాలో విషాదం


మార్గ మధ్యలో సీతానగరం మండలం ఎన్‌సీఎస్‌ షుగర్స్‌ దగ్గర కింతలిపేట రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని బొలేరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలేరోలో ప్రయాణిస్తున్న ప్రవీణ్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. ప్రవీణ భార్య ఆరు నెలల గర్భిణి.. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివాహమైన తొమ్మిది నెలలకే ఇలా చనిపోవడం, భార్య ఆరు నెలల గర్భిణి కావడంతో తీవ్ర విషాదాన్ని నింపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.