యాప్నగరం

‌మర్కజ్ వెళ్లిన వ్యక్తికి కరోనా పాజిటివ్... మంగళగిరిలో రెడ్ అలర్ట్

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు. మర్కజ్ వెళ్లొచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్. మంగళగిరిలో రెడ జోన్. కరోనా పాజిటివ్‌ కేసుతో సమీపంలోని దుకాణాలు, కూరగాయల మార్కెట్లను మూసివేయించారు.

Samayam Telugu 2 Apr 2020, 10:52 am
ఏపీలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. గత అర్ధరాత్రి 65 ఏళ్ల వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పురపాలక సంఘ కమిషనర్‌ హేమమాలిని తెలిపారు. ఆ వ్యక్తి ఇటీవల ఢిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. అతనితో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. పట్టణంలోని టిప్పర్ల బజార్‌లో ఉన్న కరోనా బాధితుడి నివాసం నుంచి 3కి.మీల పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు కమిషనర్‌ చెప్పారు. కరోనా పాజిటివ్‌ కేసుతో సమీపంలోని దుకాణాలు, కూరగాయల మార్కెట్లను మూసివేయించారు. 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించి ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. ఆ ప్రాంతమంతా హైఅలర్ట్‌ ప్రకటించామని కమిషనర్‌ తెలిపారు.
Samayam Telugu corona virus


నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 67 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం రాత్రి వరకు 44గా ఉన్న కేసుల సంఖ్య ఒక్కసారిగా 111కు చేరుకుంది. రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 14 కేసులు రికార్డ్ అయ్యాయి. కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాల్లో 15మంది చొప్పున కరోనా వ్యాధి బారిన పడ్డారు.

మరోవైపు రోనా కేసులు దేశంలో ప్రబలుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం జగన్ పాల్గొననున్నారు.కరోనా మరింత వేగంగా విస్తరిస్తుండడంపై ముఖ్యంగా జగన్ చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం జగన్ అదేశించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.