యాప్నగరం

Kasturi Nani: పుదుచ్చేరి మంత్రి మల్లాడిని పరామర్శించిన జనసేన నేత కస్తూరి నాని

పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావును జనసేన నేత కస్తూరి నాని పరామర్శించారు. నవంబర్ 7న కృష్ణారావు తండ్రి సూర్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు.

Samayam Telugu 20 Nov 2019, 9:04 pm
ఇటీవల పితృ వియోగం చెందిన పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావును జనసేన నేత కస్తూరి సత్యప్రసాద్ (నాని) బుధవారం పరామర్శించారు. యానాంలోని మంత్రి నివాసం యర్రా గార్డెన్స్‌కు వెళ్లిన నాని.. ఆయన్ను పరామర్శించారు. మల్లాడి కృష్ణారావు తండ్రి సూర్యనారాయణ ఇటీవలే కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడిన ఆయన కాకినాడలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ నవంబర్ 7న రాత్రి సమయంలో తుదిశ్వాస విడిచారు.
Samayam Telugu kasturi nani2


కస్తూరి నాని గురించి..

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కస్తూరి నాని జనసేనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో ఆయన రెడ్ రివల్యూషన్ అనే ప్రజా ఫిర్యాదు వ్యవస్థను తీసుకొచ్చారు. దీని ప్రకారం గ్రామంలోని ఓ గోడ మీద ఎరుపు రంగు వేసి.. దాని మీద ఆ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాస్తున్నారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో ఉన్న సమస్యలేంటో ప్రజలకు నిరంతరం గుర్తు రావడంతోపాటు.. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా వాటి పరిష్కారానికి కృషి చేసే అవకాశం ఉంది. ‘రెడ్ రివల్యూషన్’కు పవన్ నుంచి ప్రశంసలు లభించాయి.
2019 ఎన్నికల సమయంలో నాని ఎలాంటి పదవి ఆశించకుండా జనసేన తరఫున ప్రచారం చేశారు. నిడదవోలు పరిసర గ్రామాల్లో పర్యటించి.. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలాతో మాట్లాడి.. సమస్యల పరిష్కారం కోసం నాటి సీఎం చంద్రబాబు నాయుడికి ఉత్తరాలు కూడా రాయించారు. ఎర్ర కాలువ వరదల సమయంలోనూ ఆయన ముంపు ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టారు.

గురువారం జగన్..
నవంబర్ 21న యానాంలో సూర్యనారాయణ పెద్ద కర్మలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ హాజరవుతారు. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావును ఆయన పరామర్శిస్తారు. మల్లాడి కృష్ణారావుకు వైఎస్ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన మల్లాడి.. ఆయనకు వైఎస్ విగ్రహాన్ని బహూకరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.