CM Camp Office: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని.. ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు కలిశారు. ఇటీవల పోలీసు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు రూ. 554 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డిని కలిసి.. పోలీసు అధికారుల సంఘం (AP Police Officers Association) ప్రతినిధులు కృతజ్ఞతలు చెప్పారు. తమ ప్రభుత్వంలో పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం జగన్ వారికి వివరించారు. దీనిపై పోలీసు అధికారుల సంఘం ప్రతినిధుల హర్షం వ్యక్తం చేశారు.
CM Camp Office: జగన్ను కలిసిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు
CM Camp Office: సీఎం జగన్ను ఏపీ పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు కలిశారు. తమకు రావాల్సిన బకాయిలు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. పోలీసుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు జగన్ వెల్లడించారు.
ప్రధానాంశాలు:
- జగన్ను కలిసిన పోలీసు అధికారుల సంఘం బాధ్యులు
- ఇటీవల పోలీసు ఉద్యోగులకు బకాయిలు విడుదల
- సీఎంకు కృతజ్ఞతలు చెప్పిన సంఘం ప్రతినిధులు