యాప్నగరం

రెచ్చిపోయిన రెవెన్యూ ఉద్యోగి.. క్యాస్ట్ సర్టిఫికెట్ అడగడమే పాపం.!

క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం వారం రోజుల నుంచి తిరుగుతున్నాను.. లంచం ఇవ్వకపోతే పనులు చేయరా అని ప్రశ్నించినందుకు దరఖాస్తుదారుడిపై పిడిగుద్దులు కురిపించిన ఘటన ముసునూరులో జరిగింది.

Samayam Telugu 27 Nov 2019, 10:38 pm
కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు ఎన్నిసార్లు తిప్పుకుంటారని ప్రశ్నించడమే తప్పైంది. లంచం ఇవ్వకపోతే పనిచేయరా అని నిలదీయడంతో కంప్యూటర్ ఆపరేటర్ రెచ్చిపోయాడు. దరఖాస్తుదారుడిపై పిడిగుద్దులు కురిపించిన అమానుష ఘటన కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. అక్కడ ఉన్న వారు కల్పించుకుని పక్కకు తీయడంతో గొడవ సర్దుమణిగింది. పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది.
Samayam Telugu revenue


మద్దాల బాబూరావు అనే వ్యక్తి కుల ధ్రువీకరణ పత్రం కోసం ముసునూరు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. వారం రోజులుగా తిప్పించుకుంటున్నారని వాపోయాడు. ఆవేశంగా లంచం ఇవ్వకపోతే పనులు చేయరా అంటూ నిలదీశాడు. దీంతో కంప్యూటర్ ఆపరేటర్ పవన్, బాబూరావు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు దూషించుకున్నారు.

Also Read: గుంటూరు జిల్లాలో దారుణం.. వివాహిత ప్రాణం తీసిన టిక్‌టాక్.. భార్యను చంపేసి..

ఇంతలోనే రెచ్చిపోయిన కంప్యూటర్ ఆపరేటర్ పవన్ గది లోపల నుంచి పరుగున వచ్చి బాబూరావుపై పిడిగుద్దులు కురిపించాడు. పక్కనే ఉన్న వారు వారిస్తున్నా అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో బాబూరావుకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుడు పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతానంటూ వెళ్తున్న వీడియో బయటకు రావడంతో వైరల్ అయింది.

తనపై దాడి చేశారని బాబూరావు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాబూరావు తనను దూషించాడని పవన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే కుల ధ్రువీకరణ పత్రం సకాలంలో ఇవ్వకపోగా దరఖాస్తుదారుడిపై దాడికి పాల్పడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కంప్యూటర్ ఆపరేటర్ తీరును పలువురు ఖండిస్తున్నారు.

Read Also: ఆలయానికి వచ్చిన మహిళపై పూజారి అఘాయిత్యం.. విచారణ.!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.