యాప్నగరం

అనంతపురంలో ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు దుర్మరణం

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించగా ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు.

Samayam Telugu 7 Sep 2020, 4:56 pm
అనంతపురం జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గం మండలం కదరంపల్లి జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయ సురేష్‌ (28), చాకలి కృష్ణ (30), బెంగళూరుకు చెందిన సిద్ధనగౌడ (30) తో కలిసి బెలుగుప్ప మండలం గుండ్లపల్లి నుంచి కదరంపల్లి వైపునకు ద్విచక్రవాహంపై బయల్దేరారు.
Samayam Telugu అనంతపురం రోడ్డు ప్రమాదం


అయితే మార్గమధ్యంలో కదరంపల్లి గ్రామం జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో రాయదుర్గం ఎస్సై రాఘవేంద్రప్ప ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను వెంటనే రాయదుర్గం సీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ దుర్ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై రాఘవేంద్రప్ప వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.