యాప్నగరం

గుంటూరులో ఘోర ప్రమాదం.. చెల్లాచెదురుగా మృతదేహాలు

గుంటూరు జిల్లా శావల్యాపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Samayam Telugu 9 Sep 2020, 5:01 pm
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కనమర్లపూడి వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకకి బలంగా ఢీ కొట్టాయి.
Samayam Telugu గుంటూరు రోడ్డు ప్రమాదం


నంద్యాల నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు, ఏలూరు నుంచి వినుకొండ వైపు వస్తున్న మరో కారు ఎదురేదురుగా వేగంగా వచ్చి ఢీకొకొన్నాయి. ఈ ఘటనలో ఏలూరుకి చెందిన ఉదయ్, నంద్యాలకు చెందిన వెంకటసుబ్బయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారందరినీ వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.