యాప్నగరం

కడపలో ఘోరం.. లారీ డ్రైవర్, క్లీనర్ సజీవదహనం

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ సజీవదహనమయ్యారు.

Samayam Telugu 7 Jun 2020, 2:38 pm
వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట వద్ద కడప- కర్నూలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం ఓ లారీ దగ్ధమైంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌ సజీవ దహనమయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి కడప జిల్లా మైదుకూరు వైపుగా వేగంగా వెళ్తున్న సిమెంట్‌ లారీ బలంగా డివైడర్‌ను ఢీకొట్టింది. తర్వాత అదుపు తప్పి లారీ బోల్తా కొట్టింది.
Samayam Telugu దగ్ధమవుతున్న లారీ


దీంతో వెంటనే లారీ నుంచి మంటలు చెలరేగాయి. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌, క్లీనర్‌ బయటకు రాలేకపోయారు. స్థానికులు వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కుదరలేదు. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్ లారీలోనే సజీవదహనమయ్యారు.

స్థానికులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు అందించారు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.