యాప్నగరం

ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. కరెంటు వైర్లు పడి 10 మంది మృతి

దాదాపు 30 మంది వరకూ కూలీలు ఈ ట్రాక్టర్‌లో వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే 9 మంది చనిపోగా, మిగతా వారిని ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

Samayam Telugu 14 May 2020, 8:46 pm
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో పలువురు అక్కడికక్కడే చనిపోయారు. కరెంటు తీగలు తెగి కూలీలపై పడడంతో షాక్ తగిలి వారంతా చనిపోయినట్లుగా తెలుస్తోంది. నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలోని మాచవరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరంతా సమీపంలోని మిరప తోటలో రోజంతా పని చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Samayam Telugu కరెంట్ షాక్‌కు గురై చనిపోయిన వారు


దాదాపు 30 మంది వరకూ కూలీలు ఈ ట్రాక్టర్‌లో వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే 9 మంది చనిపోగా, మిగతా వారిని స్థానికులు కాపాడి ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10కి చేరింది. మరో ఇద్దరిపరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు రాపర్ల సమీపంలోని మాచవరం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారిలో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు, ఓ రైతు ఉన్నారు.

Also Read: undefined
కరోనా ప్రభావం ఆ ప్రాంతంలో లేకపోవడం.. వ్యవసాయ పనులకు అనుమతి లభించడంతో గత కొద్ది రోజులుగా పస్తులుంటున్న కూలీలు పని కోసం వెళ్లారు. వీరిని గ్రామం నుంచి పొలం వరకూ రోజూ ప్రత్యేక ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్నారు. ఉదయం నుంచి పొలంలో కష్టపడి సాయంత్రం ఇళ్లకు చేరుకుంటున్న క్రమంలో గురువారం ఈ దుర్ఘటన జరిగింది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.