యాప్నగరం

వైసీపీ ఎమ్మెల్యే ఆఫీసులో చోరీ.. రూ.10లక్షలు మాయం

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో రూ.10 లక్షలు దొంగతనం. పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేత.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సంక్షేమ కార్యక్రమాల కోసం డబ్బు తెచ్చి ఉంచామన్న సిబ్బంది.

Samayam Telugu 19 Nov 2019, 7:51 am
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆఫీసులో చోరీ కలకలంరేపింది. ఆర్కే కార్యాలయంలో ఉంచిన రూ.10 లక్షల డబ్బ మాయమైంది. ఈ డబ్బు కనిపించకపోవడంతో సిబ్బంది కంగారుపడ్డారు.. కార్యాలయంలో వెతికినా సొమ్ము కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు తేలింది. రూ.10లక్షల్ని సంక్షేమ కార్యక్రమాల కోసం డబ్బును ఆఫీసులో ఉంచినట్లు సిబ్బంది చెబుతున్నారు.
Samayam Telugu ysrcp


డబ్బు చోరీపై వైఎస్సార్‌సీపీ నేత జూపూడి జాన్సన్‌ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. కార్యాలయంలో పనిచేసిన వారే సొమ్మును అపహరించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆఫీసుతో పాటూ చుట్టు పక్కల ఉన్న సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఈ దొంగతనం వ్యవహారంపై ఆరా తీశారు. ఈ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.