యాప్నగరం

JC Diwakar Reddyకి మరోసారి షాక్.. ట్రావెల్స్ బస్సులు సీజ్!

TDP నేత జేసీ దివాకర్ రెడ్డికి జగన్ సర్కారు మరోసారి షాకిచ్చింది. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన ఐదు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.

Samayam Telugu 5 Nov 2019, 8:32 pm
టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జగన్ సర్కారు మరో షాకిచ్చింది. ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులు మరోసారి ఆయనకు చెందిన ఐదు బస్సులను సీజ్ చేసినట్టు సమాచారం. మంగళవారం ఆర్టీఏ అధికారులు జరిపిన తనిఖీల్లో ఐదు బస్సులు నిబంధనల మేరకు నడవడం లేదని గుర్తించారు. కొద్ది రోజుల కిత్రం దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన పది బస్సులను సీజ్ చేయగా.. తాజాగా సీజ్ చేసిన వాటితో కలుపుకొని వాటి సంఖ్య 36కి చేరింది.
Samayam Telugu jc diwakar


ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియర్ పర్మిట్లలో అక్రమాల కారణంగానే దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 36 బస్సులను సీజ్ చేసినట్టు తెలుస్తోంది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేయడం తదితర అంశాలకు సంబంధించి దివాకర్ ట్రావెల్స్‌పై తమకు ఫిర్యాదులు వచ్చాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు.

దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయడంపై గతంలో జేసీ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్ ఉండగా.. జగన్‌కు నా బస్సులే కనిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. తనకు ఉన్న బస్సుల్లో ఇప్పటి వరకు 31 బస్సులు సీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న లోటుపాట్లు ఆర్టీసీతో సహా ఏ ట్రావెల్స్‌కైనా సహజమన్నారు. ఫైన్‌తో పోయేదానికి సీజ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఆయన జగన్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. బస్సుల సీజ్ ప్రక్రియ మాత్రం ఆగకపోవడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.