యాప్నగరం

నెల్లూరు జిల్లాలో ప్రమాదం .. పులికాట్‌ సరస్సులో బస్సు బోల్తా.. బస్సులో 80 మంది..

సుమారు 80 మందితో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ సరస్సులో బోల్తా పడిన విషాద సంఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పరిధిలో జరిగినట్లుగా తెలుస్తోంది.

Samayam Telugu 8 Nov 2019, 12:56 am
ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ పులికాట్ సరస్సులో బోల్తా పడిన దుర్ఘటన చోటుచేసుకుంది. సరస్సులో పడిన సమయంలో బస్సులో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషాద సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu rotates_sha


Read Also: తిరుపతిలో ఘోరం.. ఉద్యోగినితో బలవంతంగా మద్యం తాగించి..

సూళ్లూరుపేట నుంచి కొరిడి గ్రామానికి బయలుదేరిన బస్సు ప్రమాదవశాత్తూ పులికాట్ సరస్సులోకి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో పెద్దసంఖ్యలో ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. సుమారు 80 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.

బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయాలైన వారికి ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నారు. స్వల్ప గాయాలతో ప్రయాణికులంతా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read: విశాఖ ఎస్సై సాహసం.. మరోప్రాణం పోకూడదని..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.