యాప్నగరం

రైలు ప్రయాణికులకు అలర్ట్.. శబరి ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ మార్పు

శబరి ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌లో మార్పులు.. హైదరాబాద్ నుంచి కాదు సికింద్రాబాద్. ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ రూట్‌ను మార్చిన అధికారులు.. నాన్‌ఇంటర్‌లాకింగ్‌ సిస్టం పనులు నిర్వహిస్తుండటంతో డైవర్ట్.

Samayam Telugu 24 Jan 2020, 10:23 am
హైదరాబాద్-తిరువనంతపురం మధ్య వయా గుంటూరు నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ఈ నెల 27 నుంచి ట్రెయిన్ టైమింగ్స్‌లో మార్పులు మొదలువుతాయి. ఇకపై శబరి ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి కాకుండా సికింద్రాబాద్నుంచి బయల్దేరనుంది. ఈ మేరకు రైల్వే అధికారులు కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించారు.
Samayam Telugu sabari.


ఈ ట్రెయిన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12.20కి బయలుదేరుతుంది.. సాయంత్రం 5 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. అలాగే తిరువనంతపురం నుంచి బయల్దేరి సికింద్రాబాద్‌‌ వచ్చే శబరి ఎక్స్‌ప్రెస్‌.. ఉదయం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 6.28కి తెనాలి, 6.55కి గుంటూరు వస్తుంది.. మధ్యాహ్నం 12.10కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. రైలు ప్రయాణీకులు ఈ మార్పుల్ని గమనించాలని చెబుతున్నారు. అంతక ముందు శబరి ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరేది.. కానీ ఆ స్టేషన్‌ను తగ్గించి.. సికింద్రాబాద్ నుంచి నడుస్తుంది.

ఇటు ధర్మవరం నుంచి విజయవాడకు వెళ్లే ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ జనవరి 26 నుంచి డైవర్షన్ చేస్తున్నారు. 26 నుంచి ఫిబ్రవరి 4 వరకు ట్రైన్‌ నెంబర్ 17216 ధర్మవరం గుత్తి, ఎర్రగుంట్ల, నంద్యాల మీదుగా విజయవాడ వెళ్లే రైలును.. ధర్మవరం, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట, గూడూరు మీదుగా విజయవాడకు వెళ్లనుంది అధికారులు తెలిపారు.

ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 4వ వరకు విజయవాడ నుంచి ధర్మవరం వెళ్లే ట్రైన్‌ నెంబర్‌ 17215 కూడా విజయవాడ, గూడూరు, రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి మీదుగా ధర్మవరం వెళ్లనుంది. ఎర్రగుంట్ల, నంద్యాల, గుంటూరు డివిజన్‌లో నాన్‌ఇంటర్‌లాకింగ్‌ సిస్టం పనులు నిర్వహిస్తుండటంతో డైవర్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.