యాప్నగరం

కలిసే రండి.. అలా వస్తేనే అందరినీ ఒకేసారి ఓడిస్తాం: సజ్జల

Sajjala Ramakrishna Reddy: ఎన్నికలు ఏవైనా.. సింహం సింగిల్‌గానే వస్తుందని.. సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఎంత మంది గుంపులుగా వచ్చినా.. జగన్ ప్రజలతో కలిసి పోరాటం చేస్తారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ పొత్తు పెట్టుకుంటేనే తమకు మంచిదని.. అందర్నీ ఒకేసారి ఓడించే అవకాశం వస్తుందని అన్నారు. జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపునకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా.. తాడేపల్లిలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 9 Jan 2023, 3:19 pm
Sajjala Ramakrishna Reddy: ఎంత మంది కలిసి వచ్చినా తమకు మంచిదేనని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. గుంపుగా వస్తేనే అందరినీ ఒకేసారి ఓడించే అవకాశం జగన్‌కు దక్కుతుందని వ్యాఖ్యానించారు. జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపునకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా.. తాడేపల్లిలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల.. YSRCP నేతలతో కలిసి భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పవన్, చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.
Samayam Telugu Sajjala Ramakrishna Reddy
సజ్జల రామకృష్ణా రెడ్డి


ముఖ్యమంత్రి జగన్ (YS Jagan Mohan Reddy) ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంలో లేరని సజ్జల స్పష్టం చేశారు. ప్రజలు ఐదేళ్ల కాలానికి తీర్పు ఇచ్చారని.. తాము పూర్తిగా పాలించి ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. జనసేన, టీడీపీ కలవటాన్ని వామపక్షాలు స్వాగతించటం విచిత్రంగా ఉందన్నారు. బీజేపీ కూడా కలిస్తే వామపక్షాలు ఏ వైఖరి తీసుకుంటాయని సజ్జల ప్రశ్నించారు. ఎరుపు, కాషాయం కలిసి పసుపు అవుతుందేమోనని సెటైర్లు వేశారు. అందరూ కలిస్తే ఎవరి విలువలు ఏంటో మరోసారి బయటపడతాయని అన్నారు. అందరినీ కలిసి ఒకేసారి ఓడించే అవకాశం కోసమే జగన్ ఎదురు చూస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు.

2019 ఎన్నికల్లో తమకు 151 స్థానాలు ఆషామాషీగా రాలేదని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో.. చంద్రబాబును వదలించుకోవాలనే స్థితిలో నాటి ప్రభుత్వానికి, టీడీపీకి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసి వైఎస్సార్సీపీకి పట్టం కట్టారని వివరించారు. గత ఎన్నికల్లోనూ జగన్ సింగిల్ గానే పోటీ చేశారని.. 2024 ఎన్నికల్లోనూ సింగిల్‌గానే పోటీకి సిద్దంగా ఉన్నారని స్పష్టం చెప్పారు. ఎవరెవరు కలిసి వస్తారో వారే డిసైడ్ చేసుకొని రావాలని అన్నారు. ఎంత మంది వచ్చినా.. ఎన్ని కుట్రలు చేసినా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.