యాప్నగరం

YSRCP: ఎంతమంది కుట్రలు చేసినా.. వైసీపీకి ఓటమి ఉండదు: సజ్జల

YSRCP Formation Day: ఎంత మంది కుట్రలు చేసినా.. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఉండదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సదర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో జెండా ఎగురవేసిన ఆయన.. సీఎం జగన్ ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 12 Mar 2023, 12:04 pm

ప్రధానాంశాలు:

  • 12 ఏళ్లుగా జగన్ ఆదర్శవంతంగా పార్టీని నడుపుతున్నారు
  • వైసీపీకి ఎప్పటికి ఓటమి ఉండదు
  • పార్టీ ఆవిర్భావ వేడుకల్లో సజ్జల
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu YSRCP Formation Day
సజ్జల రామకృష్ణారెడ్డి
YSRCP Formation Day: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నేతలు పార్టీ జెండాలు ఎగురవేశారు. వైఎస్సాఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేకులు కట్ చేసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. గత 12 ఏళ్లుగా సీఎం జగన్ పార్టీని ఆదర్శవంతంగా నడుపుతున్నారని అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు జగన్ అని కొనియాడారు.
ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల కోసం పోరాడారని సజ్జల గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారన్నారు. అవినీతి లేకుండా ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నారన్నారు. విద్య, వైద్య రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. దేశ చరిత్రలోనే ఎవ్వరూ చెయ్యని రీతిలో ఉద్యోగాల భర్తీ చేశారన్నారు. సచివాలయ వ్యవస్థతో పరిపాలన స్వరూపాన్ని మార్చేశారన్నారు. మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన పార్టీ మరొకటి లేదన్నారు.

ప్రజలకు జవాబుదారీగా వైఎస్ జగన్ ప్రభుత్వం నడుస్తోందని సజ్జల అన్నారు. సీఎం జగన్ తన అధికారాన్ని బాధ్యతగా భావించి పని చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ రోల్ మోడల్ అని వ్యాఖ్యనించారు. వైఎస్సాఆర్ పార్టీకి ఎప్పటికి ఓటమి ఉండదని..ఎంత మంది కుట్రలు చేసినా వైసీపీని ఏం చేయ్యలేరని అన్నారు.

రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.