యాప్నగరం

ఎన్డీఏలో చేరడంపై వైసీపీ ముఖ్య నేత కీలక వ్యాఖ్యలు

ఐటీ దాడుల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఎన్టీఏలోకి వైసీపీ చేరబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

Samayam Telugu 15 Feb 2020, 7:34 pm
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరబోతున్నట్లు గత రెండు రోజులుగా వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి ప్రచారం మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు.
Samayam Telugu sajjala


Also Read: సీఎం జగన్ అలా చేస్తే రాజీనామా.. ఉప ముఖ్యమంత్రి సంచలనం

‘‘మాటకు విపరీత అర్థాలు తీసి, లేనిది ఉన్నట్లుగా చెప్పి ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎల్లో మీడియా అష్టకష్టాలు పడుతోంది. దాంట్లో భాగమే వైఎస్సార్‌సీపీ ఎన్డీయేలో చేరుతున్నట్లుగా రాసిన వార్త. అందుకే పుట్టుకతో వచ్చిన బుద్ధిపోదని పెద్దలంటారు.’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్ చేశారు.

Also Read: అమరావతిపై ఒట్టు వేయను.. నేనేమైనా ముఖ్యమంత్రినా.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయినప్పటి నుంచి వైసీపీ ఎన్డీఏ చేరబోతున్నట్లు వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. ఎన్డీఏలో వైసీపీ చేరికపై అనేక ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో సీఎం జగన్‌కు అత్యంత ఆప్తుడైన సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.