యాప్నగరం

పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కారుకు సుప్రీం కీలక ఆదేశాలు

బచావత్ అవార్డు నిబంధనలకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగుతోందని ఒడిశా అభ్యంతరాలను లేవనెత్తింది. దీనికి స్పందించిన సుప్రీం.. ప్రాజెక్టు స్టేటస్ రిపోర్టు, ఫోటోలను అందజేయాలని ఏపీ సర్కారును ఆదేశించింది.

Samayam Telugu 14 Jan 2020, 2:59 pm
పోలవరం ప్రాజెక్టు స్టేటస్‌ రిపోర్టు, నిర్మాణ ఫొటోలను తమకు అందజేయాలని సుప్రీం కోర్టు జగన్ సర్కారును ఆదేశించింది. ఒడిశా, తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణం సాగుతోందని ఒడిశా తరఫు న్యాయవాది సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. ముంపు విషయంలో కనీస అధ్యయనం కూడా చేయలేదని ఒడిశా ఆరోపించింది.
Samayam Telugu polavaram


మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై తమకు అభ్యంతరాలు లేవని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. మణుగూరు ప్లాంట్, గిరిజనులకు ముంపు నష్టం లేకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు లేవని, యథాతథంగా నిర్మాణం కొనసాగుతోందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. రెండు వారాల్లోగా పోలవరం నిర్మాణానికి సంబంధించిన సమాచారం ఇస్తామని ఆయన తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయస్థానం.. కేసును రెండు వారాలపాటు వాయిదా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.