యాప్నగరం

ఏపీలో యువతకు మంచి అవకాశం.. నవంబర్ 16 నుంచి!

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల. ఫొటో ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, కొత్తగా ఓటర్ల నమోదు, సవరణలకు అవకాశం. ఓటు హక్కు కోసం http://www.nvsp.in దరఖాస్తు చేసుకోవచ్చు.

Samayam Telugu 11 Aug 2020, 6:33 am
ఏపీలో యువతకు అలర్ట్.. ఫొటో ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, కొత్తగా ఓటర్ల నమోదు, సవరణలకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. 2021 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఓటు హక్కు కోసం http://www.nvsp.in దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 10 నుంచి పోలింగ్ కేంద్రాల రేషనైలేజేషన్.. ఓటర్ల జాబితాల్లో అనర్హుల పేర్లను తొలగిస్తారు. అక్టోబర్‌ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తా
Samayam Telugu ఏపీలో యువతకు అలర్ట్


నవంబర్‌ 1 నుంచి ఫాం 1 నుంచి 8 వరకు అందుబాటులో ఉంటాయి. సప్లిమెంటరీతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబర్‌ 16న ప్రకటిస్తారు. అదే రోజు నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండేవారితో పాటు ఓటర్ల జాబితాలో పేరులేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్‌ 15 వరకు ఓటరుగా నమోదుకు లేదా అభ్యంతరాలకు దరఖాస్తులను స్వీకరిస్తారు. నవంబర్‌ 28, 29, డిసెంబర్‌ 12, 13న పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన బూత్‌ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారు.

ఇక ఓటర్లుగా చేరేందుకు బూత్‌ స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా మార్పులు, చేర్పులుంటే వారి దృష్టికి తీసుకెళ్లొచ్చు. దరఖాస్తుల్ని అభ్యంతరాలను వచ్చే ఏడాది జనవరి 5 నాటికి పరిష్కరిస్తారు. జనవరి 14న తుది ఓటర్ల జాబితాలో పేర్లును చెక్ చేసుకుని జనవరి 15న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.