యాప్నగరం

YS Jagan పార్టీకి ఎస్‌ఈసీ రమేష్ గట్టి హెచ్చరిక.. ‘స్థానిక’ అభ్యర్థులు అలా చేస్తే వేటే!

YSRCP: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో లేదని, కానీ ప్రచారంపై మాత్రం నిషేధం కొనసాగుతోందని ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

Samayam Telugu 6 Apr 2020, 8:06 pm
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కోడ్‌ అమల్లో లేదని, కాని ప్రస్తుత సంధికాలంలో ప్రచారంపై మాత్రం నిషేధం కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. వివిధ పార్టీల తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులు వారి స్వప్రయోజనాల కోసం ప్రచారం.. ఓటర్లను ప్రభావితం చేసేలా చర్యలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎవరైనా అలా చేస్తే ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
Samayam Telugu pjimage (97)


ఇలాంటి ఘటనలపై క్షేత్రస్థాయి అధికారులు దృష్టిసారించాలని ఆయన ఆదేశించారు. నిజానిజాలను విచారించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులకు ఆయన లేఖ రాశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ స్వప్రయోజనాల కోసం ప్రజల మద్దతు కోరుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని ఎస్ఈసీ రమేశ్‌కుమార్‌ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ విషయాలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. వెయ్యి నగదు సాయం పంపిణీ తీరుపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. నగదు పంపిణీ చేసే సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈక్రమంలో బీజేపీ, సీపీఐ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఈసీ స్పందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.