యాప్నగరం

YS Jagan మా మాటలు పట్టించుకోలేదు, అందుకే ఇలా.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

Nimmagadda Ramesh Kumar: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. టీడీపీ అధినేత, ప్రతినక్ష నాయకుడు చంద్రబాబునాయుడుకు బంధువని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.

Samayam Telugu 15 Mar 2020, 8:14 pm
కరోనా వైరస్ వల్ల స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ చెప్పడం దారుణమని మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్రానికి కరోనా వైరస్ సోకలేదు గాని, ఎన్నికల కమిషన్‌కు మాత్రం కరోనా లాంటి ఏదో వైరస్ సోకిందని విమర్శించారు. ఎన్నికల వాయిదా నేపథ్యంలో మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌కు సోకింది చంద్రబాబు వైరస్‌నా లేక ఇంకేమైనా వైరస్సో తెలియది గాని.. రమేష్ కుమార్ మాటలను బట్టి ఈసీకి అంతుచిక్కని వైరస్ సోకిందనేది తన అభిప్రాయమని చెప్పారు. ఐదు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంటే 6 వారాల పాటు ఎన్నికలు వాయిదా వేయడం వైరస్ సంభవించడం వల్లే జరిగిందన్నారు.
Samayam Telugu jagan 1


Also Read: వైఎస్ జగన్కు మాజీ సీఎస్ కౌంటర్.. సీఎం అధికారాలకు పరిమితులివే..

ఎస్ఈసీ రమేష్ కుమార్ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తన లాంటి వాళ్లం చాలా మంది ముందు నుంచీ చెబుతున్నామని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. రమేష్ కుమార్.. చంద్రబాబు సొంత మనిషి, దగ్గరి బంధువని, ఆయన రిటైర్డ్ అయ్యే సమయంలో కుట్రపూరితంగా ఎన్నికల కమిషన్‌గా వేసుకున్నారని చెప్పినట్లు గుర్తు చేశారు. ఆయనపై పదవిపై పునరాలోచించాలి అని సీఎం జగన్‌కు చాలా సార్లు చెప్పినట్లు వెల్లడించారు. కానీ, సీఎం జగన్ మాత్రం ఐఏఎస్‌లను వారిలాగే చూడాలని, చంద్రబాబు బంధువు అయినంత మాత్రాన ఇంకోలా చూడకూడదని మా మాటలు పట్టించుకోలేదని చేశారని చెప్పారు.

Also Read: నేను కోరిన వెంటనే ఎన్నికలు వాయిదా.. టీడీపీ కీలక నేత సంచలనం
దీని వల్ల ఇవాళ పరిస్థితులు చూస్తున్నామని, ఏకంగా ఎన్నికల సంఘానికే కరోనా వైరస్ సోకిందని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థులు, కార్యకర్తలకు తాను ఒకటే చెబుతున్నానని, ఎవరెన్ని కుట్రలు చేసినా, వైరస్‌లు వచ్చినా వైసీపీ విజయాన్ని నిలువరించలేవని స్పష్టం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనూ తమపై ఇలాగే విషం చిమ్మారని, అయినా 151 సీట్లు గెలిచినట్లు తెలిపారు. ఈసారి కూడా ఎన్ని కుట్రలు చేసినా గత ఎన్నికల కంటే భారీ మెజారిటీతో జగన్ గెలవబోతున్నారని స్పష్టం చేశారు.

Also Read: ఎస్ఈసీ రమేష్‌ నియామకంపై చంద్రబాబు ట్విస్ట్.. ఇది మాజీ గవర్నర్ నరసింహన్ పనంట!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.