యాప్నగరం

శ్రీకాకుళం‌వాసులకు అలర్ట్: 144 సెక్షన్ అమలు, వివరాలివే.. బయటకు వచ్చారో!

రోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకున్నారు. కఠిన నిబంధనల్ని అమలు చేయనున్నారు. శ్రీకాకుళంలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంలోకి ప్రవేశించే ముఖ్యంగా ఆరు మార్గాల దగ్గర ఆంక్షలు.

Samayam Telugu 1 Sep 2020, 6:52 am
శ్రీకాకుళం జిల్లాను కరోనా వణికిస్తోంది.. ముఖ్యంగా శ్రీకాకుళంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకున్నారు. కఠిన నిబంధనల్ని అమలు చేయనున్నారు. శ్రీకాకుళంలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మంగళవారం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఎవరు అనవసరంగా బయట తిరగకూడదు. ఎవరైనా అనవసరంగా బయట తిరిగితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు.
Samayam Telugu శ్రీకాకుళంవాసులకు అలర్ట్


ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే దుకాణాలుకు అనుమతి. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మందుల దుకాణాలు మినహా ఏ ఇతర దుకాణాలు, చిల్లర దుకాణాలతో సహా, తెరవడానికి వీల్లేదు. శ్రీకాకుళం పట్టణంలోకి ప్రవేశాన్ని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నిషేధించారు.
ప్రజలు తమకు సహకరించాలని అధికారులు కోరారు.

శ్రీకాకుళం పట్టణంలోకి ప్రవేశించే ముఖ్యంగా ఆరు మార్గాలు.. తోటపాలెం జంక్షన్, బలగ ఏసిబి కార్యాలయం మార్గం, పొన్నాడ బ్రిడ్జి, అరసవల్లి జంక్షన్, రామలక్ష్మణ జంక్షన్, కిల్లిపాలెం జంక్షన్‌ను గుర్తించి, పనులు లేకుండా అనవసర రాకపోకలను నిరోధించడానికి చర్యలు తీసుకున్నారు. బయటకు వచ్చే వారు మాస్కు, ఫేస్ షీల్డు ధరించాలి. చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని, ప్రతి చోట ముఖ్యంగా దుకాణాలు, మార్కెట్ల వద్ద భౌతిక దూరం పాటించాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.