యాప్నగరం

ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాథ్ దాస్

ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలం నేటి ముగియనుంది. దీంతో ఆమెను సీఎం ముఖ్యసలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి జగన్‌కు ఆదిత్యనాథ్ దాస్ కృతజ్ఞతలు తెలిపారు.

Samayam Telugu 31 Dec 2020, 5:11 pm
ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని నుంచి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన దాస్‌కు అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలం నేటి ముగియనుంది. దీంతో ఆమెను సీఎం ముఖ్యసలహాదారుగా ప్రభుత్వం నియమించింది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ నియామకానికి సీఎం జగన్‌ ఆమోద ముద్ర వేశారు.
Samayam Telugu ఆదిత్యనాథ్ దాస్


సీఎస్‌గా తనకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ఆదిత్యనాథ్‌దాస్.. ముఖ్యమంత్రి జగన్‌కు ఆదిత్యనాథ్ దాస్ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని.. ఆ లక్ష్యం మేరకు పోలవరం పూర్తి చేస్తామన్నారు. అన్ని సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని.. ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకే అధికారులంతా పనిచేస్తామని స్పష్టం చేశారు.

ఐఏఎస్‌ అధికారుల బాధ్యతల్లోనూ ప్రభుత్వం మార్పు చేసింది. ఆదిత్యనాథ్‌ దాస్‌ సీఎస్‌గా నియమితులుకాగా.. జలవనరులశాఖ కార్యదర్శిగా జె.శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన పురపాలక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ కేడర్‌ నుంచి ఏపీకి మారిన ఐఏఎస్‌ అధికారిని వై.శ్రీలక్ష్మిని పురపాలక శాఖ కార్యదర్శిగా, కె. సునీతను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.