యాప్నగరం

ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా త్రిపాఠి..

సీనియర్ ఐపీఎస్ అధికారులను జగన్ సర్కార్ బదిలీ చేసింది. ఏపీ భవన్ ప్రిన్సిపల్ ఆర్సీ, ఆర్సీలుగా త్రిపాఠి, భావనా సక్సేనాను నియమించింది. మరో సీనియర్ అధికారిని ఏసీబీ జేడీగా నియమిస్తూ ఆదేశాలిచ్చింది.

Samayam Telugu 27 Nov 2019, 12:11 am
ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా 1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అభయ్ త్రిపాఠిని నియమించింది. రెసిడెంట్ కమిషనర్‌గా 1996 బ్యాచ్ అధికారి భావనా సక్సేనా నియమితులయ్యారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా 2006 బ్యాచ్‌కి చెందిన జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
Samayam Telugu andhra-bhavan-Delhi


గతంలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ప్రస్తుతం సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన స్థానంలో భావనా సక్సేనాను నియమించడం విశేషం. ఇటీవల ఢిల్లీలోని తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో జరిగిన బ్రహ్మెత్సవాల్లో సుమారు రూ.4 కోట్ల మేర అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులను విచారణకు ఢిల్లీకి పంపారు.

Also Read: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

ఎవరో రాసిన ఉత్తరంపై విచారణ జరిపించడాన్ని ఢిల్లీలోని ఆలయాన్ని పర్యవేక్షించే ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ అభ్యంతరం తెలిపారు. ఆరోపణలు వచ్చిన తర్వాత డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తున్నామని, అదే సమయంలో టీటీడీ ఎస్సై స్థాయి అధికారిని విచారణకు పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ వైఖరిని నిరసిస్తూ స్తానిక సలహా కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా కూడా చేశారు. అప్పట్లో అన్ని వివాదాలకు కారణమైన ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా భావనా సక్సేనాను నియమించడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.