యాప్నగరం

Amaravati: ఆదినారాయణ రెడ్డి మీద 'బాబాయ్ గొడ్డలి వేటు' పడేదా?: సత్యకుమార్

Amaravati: అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనను జనసేన సహా.. ఇతర పార్టీలు ఖండించాయి. అయితే.. ఈ ఘటనపై సత్య కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయని.. అందుకే తమపై దాడి చేశారని ఆరోపించారు. మరోవైపు ఎంపీ నందిగం సురేష్‌పైనా సత్యకుమార్ ఆరోపణలు చేశారు. ఈ దాడికి ఆయనే కారణమని.. ఆదినారాయణ రెడ్డి తప్పించుకున్నారని ఎంపీ సురేష్ అన్నారంటే ఏంటీ అర్థం..? అని ప్రశ్నించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 31 Mar 2023, 5:57 pm

ప్రధానాంశాలు:

  • సత్య కుమార్ కాన్వాయ్ లోని కార్లపై దాడి
  • దాడి ఘటనపై ఘాటు స్పందించిన సత్యకుమార్
  • ఎంపీ నందిగం సురేష్‌పై సత్యకుమార్ ఆరోపణలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Satyakumar
సత్యకుమార్
Amaravati: తమపై దాడి జరుగుతోంటే పోలీసులు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని.. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ప్రశ్నించారు. తప్పులు చేసే అధికారులపై పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. భౌతికదాడులకు సిద్దమని వైసీపీ చెబితే.. తాము కూడా సిద్దమేనని స్పష్టం చేశారు.
'అమరావతి రైతులకు సంఘీభావం తెలపడానికి మందడం వెళ్లాం. YS Jagan Mohan Reddy ఏ విధంగా రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టారో వివరించాం. సీడ్ యాక్సెస్ రోడ్డు సమీపంలో మమ్మల్ని పోలీసులు ఆపారు. పోలీసులు ఆపడంతోనే మాపై దాడి చేశారు. వైసీపీ కార్యకర్తలకు పోలీసులు సహకరించారు. మా వాహానం పైనా.. మాపైనా దాడి మీద చేస్తుంటే.. పోలీసులు మమ్మల్ని రోప్ పెట్టి అడ్డుకున్నారు. ఆదినారాయణ రెడ్డి తప్పించుకున్నారని ఎంపీ సురేష్ అన్నారంటే ఏంటీ అర్థం? ఆదినారాయణ రెడ్డి మీద బాబాయ్ గొడ్డలి వేటు పడేదా..?' అని సత్యకుమార్ (Satyakumar) ప్రశ్నించారు.

'తాడేపల్లి ప్యాలెస్ నుంచే పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. దీని పై కేంద్ర నాయకత్వం సీరియస్‌గా ఉంది. నాదెండ్ల మనోహర్ ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. నేను డీజీపీకి ఫోన్ చేస్తే ఆయన స్పందించడం లేదు. అంత మంది పోలీసులు ఎందుకున్నారు..?' అని సత్యకుమార్ నిలదీశారు.

'మందడంలో రైతుల శిబిరానికి వెళ్లాం. సంఘీభావం తెలిపాం. అమరావతి ఇక్కడే ఉంటుందని అక్కడా చెప్పాం.. ఇక్కడా చెబుతున్నాం. నా పేరును ప్రత్యేకంగా వాడారు. నాపై కక్ష కట్టారు. ఏప్రిల్ 30వ తేదీ లోగా వివేకా హత్య కేసు తేల్చాలని Supreme Court చెప్పింది. ఆ కోపంతోనే నాపై దాడి జరిగింది. నన్ను చంపితే మూడు రాజధానులు వస్తాయా? నేను ఒంటరిగా రావడానికి సిద్దం. దీన్ని వదిలిపెట్టం.. తీవ్ర కార్యాచరణ తీసుకుంటాం. ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. బీజేపీపైనా.. నాపైనే ఎందుకు దాడి చేశారో వాళ్లే చెప్పాలి. ఎంపీ నందిగం సురేష్‌పై చర్యలు తీసుకోవాలి. అతని కాల్ డేటా బయటకి తీయాలి. తాడేపల్లి నుంచి అతనికి ఆదేశాలు రాకపోతే.. ఎందుకు Nandigam Suresh తన అనుచరులను పంపారు' అని ఆదినారాయణ రెడ్డి (Adinarayana Reddy) ప్రశ్నించారు.

'అమరావతి రాజధానిగా ఉంచాలని రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ నేత సత్యకుమార్‌ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓటమిని జీర్ణించుకోలేక బీజేపీ నేతలపై వైసీపీ దాడులు చేయిస్తోంది. ఏపీలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో సత్యకుమార్‌ పై దాడి నిదర్శనం' అని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.