యాప్నగరం

కడప: పట్టాలు తప్పిన షిర్డీ ఎక్స్‌ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం

రైల్వే కోడూరు సమీపంలో పట్టాలు తప్పిన షిర్డీ ఎక్స్‌ప్రెస్. చాకచక్యంగా వ్యవహరించిన లోకో పైలట్.. తప్పిన పెను ప్రమాదం. ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు.

Samayam Telugu 3 Dec 2019, 11:36 am
తిరుపతి-షిర్డీ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కడప జిల్లా రైల్వేకోడూరు సమీపంలో రైలు పట్టాలు తప్పింది.. వెంటనే గమనించిన లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ముప్పు తప్పింది. ఇంజిన్‌ వెనక ఉన్న జనరల్‌ బోగీ పక్కకు ఒరిగిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.. దీంతో రైల్వేశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైలు తిరుపతి నుంచి షిర్డీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Samayam Telugu shiridi


షిర్డీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో.. ఆ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలంలో మరమ్మతులు చేస్తున్నారు. అలాగే రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం కూడా తిరుపతిలో కేరళ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. ఏర్పేడు రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాంట్రీ కార్ చక్రం విరగడంతో ప్రమాదం జరిగింది. రైలు లోకో పైలట్ వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. మళ్లీ ఇప్పుడు షిర్డీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడం కలకలంరేపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.