యాప్నగరం

ఆన్‌డ్యూటీ సీఎం సార్.. వైఎస్ జగన్‌‌, పీవీ సింధు మధ్య ఆసక్తికర చర్చ

బ్యాడ్మింటన్ స్టార్.. ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని కలిశారు. టోక్యో ఒలింపిక్స్‌కి సన్నద్ధమవుతున్నట్లు చెప్పడంతో సీఎం ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ తెలియజేశారు.

Samayam Telugu 29 Nov 2019, 11:12 pm
స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన సింధు.. సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. పుష్ఫగుచ్ఛం అందజేసి జగన్‌కి విషెస్ తెలిపారు. ఈ భేటీలో ఒలింపిక్స్‌ సన్నద్ధత, బ్యాడ్మింటన్ అకాడమీకి స్థల కేటాయింపులు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
Samayam Telugu pv sindhu.


2020లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్నట్లు పీవీ సింధు సీఎంకి తెలియజేశారు. స్పందించిన జగన్ ఒలింపిక్స్‌లో విజయం సాధించాలంటూ ఆల్ ది బెస్ట్ చెప్పి ప్రోత్సహించారు. అలాగే గతంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీకి స్థలం గుర్తిస్తున్నట్లు జగన్ తెలిపారు. అనువైన చోట స్థలం ఎంపిక చేసుకోవాలని సీఎం జగన్ సింధూకి సూచించినట్లు సమాచారం.

Also Read: సీఎం జగన్‌‌కు ముప్పు.. మాజీ మంత్రి కుట్రపన్నారు.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు

సీఎం జగన్‌తో భేటీలో మరో ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌కి సిద్ధమవుతున్నానని.. అందువల్ల ఆ సమయాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించాలని జగన్‌కి షట్లర్ సింధు విజ్ఞప్తి చేశారు. గత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సింధుకి అప్పటి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె అధికారికంగా డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు కూడా స్వీకరించారు. ఒలింపిక్స్ సన్నద్ధత కారణంగా విధులకు హాజరుకాలేకపోతున్నానని.. ఆన్‌డ్యూటీగా పరిగణించాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.